Price: Rs.50.00 /-
No.Pages: 64.
అంటరానితనం - ఇంకానా? : బొజ్జా తారకం ‘‘అంటరానితనం నాడు ` నేడు ‘ రేపు అనే శీర్షికతో తారకంగారు 2006లో ఒక రాత ప్రతి సిద్ధం చేశారు. కార్య వ్యగ్రత వ్ల దానిని ప్రచురించలేదు. తర్వాత 2008లో దానిని 108 పుటకు (రాత ప్రతి) కుదించారు. దానినీ ప్రచురించలేదు. అంటరానితనం అనేది శతాబ్దాుగా భారత దేశంలో పాతకుపోయిన దురాచారం. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. 2008 నాటి పరిస్థితి 2019 నాటికి మెరుగుపడకపోగా ఇంకా విషమ స్థితికి చేరుకుంటూ ఉన్నది. తారకంగారి అప్పటి ఆలోచను ఈనాడూ సమాజానికి అవసరమౌతున్నాయి. వారు 2007 లో రాసిన ‘‘అరవై ఏళ్ళలో దళిత సామాజిక ప్రగతి’’ అనే వ్యాసాన్ని కూడా దీనితో పాటే పాఠకు ముందు ఉంచుతున్నాం. ఎందుకంటే ఈనాటి సమాజానికి వీటి అవసరం ఉన్నదని గుర్తు చేసే సంఘటను ఇప్పుడూ జరుగుతూ ఉన్నాయి. ఇటీవలే ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండం సింగంపల్లిలో ఒక దళిత యువకుడి హత్య జరిగింది. బిక్కి శ్రీని అనే అతడు వర్షం కారణంగా రోడ్డు పక్కనే ఉన్న మామిడి తోటలో ఆగాడు. వర్షానికీ గాలికీ మామిడి కాయు రాలి కింద పడి ఉన్నాయి. రెండు మూడు కాయు చేతిలోకి తీసుకున్నాడు అదే సమయానికి తోట కాపలాదారు వచ్చి కేకు వేస్తూ మరో నుగురిని పిలిచి గొడవ చేశాడు. ఇతడు చెప్పేది వినకుండా నుగురూ అతడిని చితక బాదారు. కాయ దొంగతనానికి వచ్చాడంటూ అతడిని పంచాయితీ ఆఫీసుకు తీసుకువెళ్ళి చిత్రహింసు పెట్టారు. ఇనప కడ్డీ మద్వారంలో దూర్చి తిప్పారు. మరణించిన కళేబరాన్ని ఉరిపోసుకున్న భంగిమలో పెట్టి జరిగిన సంఘటనను ఆత్మహత్యగా చూపటానికి ప్రయత్నించారు.