Price: Rs.15.00 /-
No.Pages: 22.
శేషాచల పర్వతాల ఉత్తర భాగాన గల దట్టమైన అడవుల్లో ఓబులవారిపల్లె అనే కుగ్రామం ఉండేది. ఆ గ్రామంలో కేవలం పదకొండు ఇళ్ళు మాత్రమే ఉండేవి. వాస్తవంగా చెప్పాలంటే పదే. ఎందుకంటే పదకొండవ ఇల్లు వారికి దూరంగా అడవికి ఆనుకొని ఉండేది. ఊరి అన్ని వైపులా ఎత్తైన చెట్టు, కొండలు ఉండేవి. పచ్చటి చెట్లు కొండలతో ఆ గ్రామమంతా కప్పబడినట్లు ఉంటుంది. గ్రామానికి సమీపంలోనే జలపాతాలుగల కొండ ఒకటుండేది. వర్షాకాలంలో ఆకాశంలోని మబ్బులు ఆ కొండను ముద్దాడుతూ ఉంటాయి. ఆ కొండ నుండి తెల్లటి, స్వచ్ఛమైన జలపాతాలు జాలువారుతాయి. అక్కడ కొన్ని చిన్న చిన్న తాటాకులు కూడా ఉండేవి. సమీప ప్రాంతంలోని ప్రజలు అక్కడి జలపాతాలలో స్నానం చేస్తూ అందులోని స్వచ్ఛమైన నీటిని తాగుతూ ఆనందంగా గడిపేవారు.
This Book Was Written By Various Authors