Price: Rs.100.00 /-
No.Pages: 102.
ఇది ఒకనాటి కథ కాదు. వెట్టిచాకిరిలో వేల యేండ్ల కింద దించిన తల ఒంగిపోయి, శ్రమలో క్రుంగిపోయి, గౌరవమో... రాజపూజ్యమో ఒకటుంటుందని ఎరగకనే కోటానుకోట్ల దళిత తల్లుల జీవితం ముగిసిపోయింది. వారి పేరుకి, వారి బతుక్కి ఒక గుర్తింపు, ఒక విలువ, ఒక గౌరవం లేకనే చరిత్ర పై పై మెరుగుల అబద్దాలను నెత్తికెత్తుకొని తిరుగుతోంది. అటువంటి అబద్దాల చరిత్ర లోతుల్ని బద్దలు కొట్టి వాస్తవాలను వెలికి తీయాల్సిన బాధ్యత ఈ దేశపు మూలవాసుల మీద వుంది. వాస్తవాల మీద నిలబడి నిజమైన చరిత్రను నిర్మించాల్సిన అవసరం ఉంది. అలా చరిత్రను వెలికి తీయడానికి ఎక్కడి వరకో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు వారి మూలాల్లోకి వెళ్ళి వారి అమ్మల చరిత్ర, అమ్మమ్మల చరిత్ర, తాతల చరిత్ర వెలికి తీస్తే చాలు. ఈ కథల ద్వారా జూపాక సుభద్ర ఒక సాంస్కృతిక చైతన్యానికి, చారిత్రక అవగాహనకు దారి వేశ ప్రయత్నం చేసింది. ఈ కథలన్నీ, దళితుల హృదయ ఘోషను అర్ధం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు తప్పక చదవాల్సిన కథలు ఇవి.