Price: Rs.200.00 /-
No.Pages: 498.
వీర తెలంగాణా విప్లవ పోరాటం మన దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహోన్నతమైన విప్లవ ప్రజా పోరాటం. భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నిర్మూలన కోసం ప్రారంభమైన తెలంగాణా ప్రజాందోళన చివరికి సాయుధ పోరాట స్వరూపాన్ని తీసుకొని నైజాం ముష్కర మూకలనూ ఆ తరువాత నెహ్రూ సైన్యాలను ఎదిరించి అయిదేండ్లపాటు 1946 నుండి 1951 వరకూ సాగింది. గత రెండు వందల సంవత్సరాల చరిత్రలో తెలంగాణా ప్రజా పోరాటంతో పోల్చదగిన ఉద్యమం గాని, పోరాటం గాని మన దేశ చరిత్రలోనే లేదు.
This Book Was Written By Various Authors