Price: Rs.60.00 /-
No.Pages: 120.
కోటి మంది తెలంగాణా ప్రజలను ఉక్కుపాదంతో అణచిపెట్టి, వారి భావ సంస్కృతులను కాలరాచి, కరకు రాచరికం చేసిన వాడు నిజాం. ఆ పాలనపై తిరుగుబాటు చేసిన తెలుగు ప్రజలకు నేతృత్వం వహించింది నాటి కమ్యూనిస్టు పార్టీ. నిజాంపై సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి అసమాన ధైర్య సాహసాలతో ముందుకు దూకిన కొదమసింహాలు కమ్యూనిస్టులు. వారు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా గెరిల్లా పోరాటాలు సాగించారు. నిజాం ప్రభుత్వ స్థైర్యాన్ని ఘోరంగా దెబ్బతీసారు. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వీర కిశోరం దుంపల మల్లారెడ్డిగారు. ఆ పోరాట యోధుడు నాటి జ్ఞాపకాలను అక్షరబద్ధం చేసి భావితరాలకు మహోపకారం చేశారు.