Price: Rs.100.00 /-
No.Pages: 150.
సాధారణంగా చరిత్ర గ్రంధాలు సుదీర్ఘంగా, సవివరంగా, విశ్లేషణాత్మకంగా ఉంటాయి. సుధీర్ఘమైన గ్రంధాలను సాధారణ పాఠకులు సంపూర్ణంగా చదివి విషయాన్ని అర్ధం చేసుకోవడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. క్లుప్తంగా ఉండే గ్రంధాలలో అనేక ప్రధానమైన అంశాలు లేకుండా పోయే అవకాశం ఉంది. వేల సంవత్సరాల సుధీర్ఘ చరిత్ర కలిగిన భారతదేశం విషయంలో ఇది మరింత వాస్తవం. కాని సులభశైలిలో, ప్రధానమైన అంశాలు ఏవీ వదిలిపెట్టకుండా ‘భారత ప్రజా చరిత్ర’ పేరుతో చిన్న చిన్న వాల్యూముల సిరీస్గా తీసుకువచ్చే ఒక బృహత్తర ప్రాజెక్టును ప్రసిద్ధ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ నేతృత్వంలో అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ చరిత్రకారుల సొసైటీ చేపట్టింది. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రచురణను తెలుగు పాఠకులకు అందించే భాధ్యతను ప్రజాశక్తి బుక్హౌస్ స్వీకరించింది. ఈ వాల్యూంలో 1858 నుంచి 1914 వరకు భారతదేశ ఆర్ధిక చరిత్రను ఇచ్చాము.