Price: Rs.100.00 /-
No.Pages: 173.
తెలంగాణ జనజీవనం, నిజాంపాలన నాటి తదనంతర రైతాంగ పోరాటం, నాటి సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక అంశాల నేపథ్యంలో దాశరథి రంగాచార్య రూపు కట్టించినట్టు మరే రచయితా చిత్రించలేదన్నది. సత్యం. చారిత్రకంగా జరిగిన సామాజిక పరిణామదశల్లో జనశ్రేణులు ఎలా స్పందించిందీ. తమ సాంస్కృతిక స్వేచ్చ కోసం ఎలా నిరసన తెల్పిందీ, రాజకీయ అస్తిత్వం కోసం ఎలా ఆందోళన, తిరుగుబాటు, ప్రతిఘటనలు చేసింది. చివరకు భూమికోసం భుక్తికోసం, భాషకోసం. వెట్టిచాకిరి అంతంకోసం, నిజాం పాలనను తుదముట్టించటంకోసం ఎలా సంఘటించి పోరాడిందీ 'దాశరథి రంగాచార్య రచనలు '' నేటి తరానికి కళ్ళముందు కదలాడేలా చేస్తాయి.