Price: Rs.80.00 /-
No.Pages: 144.
మలయాళ కథ ఆవిర్భవించి 1991 నాటికే నూరేళ్ళు అయిన సందర్భంగా “మలయాళ మనోరమ” అనే పత్రిక కవులూ, రచయితలూ. పాత్రికేయులూ, విమర్శకులూ, ప్రచురణకర్తల్నీ సంప్రదించి 146 కథల్ని ఎంపిక చేసింది. వాటిల్లోంచి జనప్రియత్వం ఆధారంగా ట్యాబ్లెట్ చేసి ఓ పది కథల్ని ఎన్నుకొని తమ పత్రికలోనే ప్రచురించింది. వాటిని అనువదించి 1993లో “నూరేళ్ళ ఉత్తమ మలయాళ కథలు” అనే పేరున తెలుగు పాఠకులకు అందించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లా నారాయణపురంకు చెందిన డా.నలిమెల భాస్కర్ తెలుగు ప్రాంతాల నుండి అనేక రాష్ట్రాలకు, ఆయాభాషలకు వనంతెనలాంటివారు. పద్నాలుగు భాషలలో లోతైన పరిచయం గల భాస్కర్ తెలుగు నుంచి ఇతర భాషల నుంచి తెలుగుకు అనువాదాలు చేసారు. "అద్దంలో గాంధారి" అనే అనువాద కథలకు తెలుగు యూనివర్సిటీ అవార్డు పొందారు. "స్మారకశిలలు" అనే మళయాలీ నవల అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ఇంకా అనేక అవార్డులు పొందారు. "సుద్దముక్క" కవితా సంపుటి. ప్రత్యేకంగా తెలంగాణ భాషపై ఒక పరకోశాన్ని రూపొందించారు. ఇప్పటికి మూడు ముద్రణలు పొందిన పుస్తకం ఇది. "బాణం" తెలంగాణా భాషా వ్యాసాలు. "మంద" మరి పదకొండు కథలు మరో అనువాద కథా సంపుటి.