Price: Rs.180.00 /-
No.Pages: 227.
బాలగోపాల్ రాసిన ‘ప్రాచీన భారతదేశ చరిత్ర : డి.డి. కోశాంబి పరిచయం’ తెలుగు పాఠకులకు సుపరిచితమే. 1986 నుండి ఎన్నో పునర్ముద్రణలు పొందింది ఆ పుస్తకం. దానికి ముందు, తర్వాత చరిత్రపై బాలగోపాల్ రాసిన పది వ్యాసాలను కలిపి ఇప్పుడు మరో పుస్తకం తీసుకొస్తున్నాం. ఇందులో సగం వ్యాసాలు వివిధ పుస్తకాలపై సమీక్షలుగా రాసినవి. రెండు నేరుగా బుక్లెట్స్ రూపంలో వచ్చినవి. ఒకటి హిస్టరీ కాంగ్రెస్లో ఆధునిక ఆంధ్రదేశ చరిత్రపై ఇచ్చిన అధ్యక్షోపన్యాసం. పాతికేళ్ళలో (1981 – 2007) అక్కడక్కడా వచ్చిన ఈ వ్యాసాలు ‘చరిత్ర’ కంటే చరిత్ర రచనా పద్ధతిని ఎక్కువగా చర్చించినందువల్ల (‘భారత కార్మిక ఉద్యమ చరిత్ర’ వ్యాసం మినహా) ఈ పుస్తకానికి దాన్నే శీర్షికగా పెట్టాం.