Price: Rs.90.00 /-
No.Pages: 154.
ప్రజల మనిషి 1938కి పూర్వపు ప్రజాజీవితం అని అళ్వార్ స్వామి చెప్పుకున్నారు. ఆ సంవత్సరం హైద్రాబాదు స్టేట్ కాంగ్రెసు స్థాపించే ప్రయత్నం జరిగింధి. ఇంకా పుట్టకముందే నిజాం ప్రభుత్వం కాంగ్రెసును నిషేధించింది. ప్రజల మనిషి ప్రచురణ 1955. రచనాకాలం 1952-55 అవుతుంది! 1948లో పోలీసుచర్య తరువాత తెలుగుదనం పెల్లుబికింది! ప్రజల మనిషి కథ అతి పల్చని పొర! ఉద్యమం కోసం అల్లిన చిన్న కథ. ఇది ఉద్యమ నవల మాత్రమే కాదు సాంఘిక చరిత్ర! నాటి అమలిన జీవితాన్నీ, ప్రేమలు, ఆప్యాయతలు, వేదనలను అతిసున్నితంగా, ఆర్ద్రంగా చిత్రించారు! ఇది నెత్తుటి మరక లేని నవల! ఆళ్వార్ స్వామి అహింసా కమ్యూనిస్టు! ఈ నవలలో సంభాషణలు తక్కువ. ఉపన్యసాలు ఎక్కువ.