Price: Rs.100.00 /-
No.Pages: 192.
ఇప్పటికి సరిగ్గా 120 ఏళ్ళ క్రితం పుట్టిన ఒక తమిళ బ్రాహ్మణ మహిళ జీవిత కథ ఇది. ఆ కాలనికి ఆ సామాజిక స్థాయికి చెందిన సగటు మహిళలందరూ గడిపిన జీవితమే కదా! ఇందులో మనం తెలుసుకోవల్సిదేముంది. అనిపించొచ్చు. అవును ఆమె ఒక సామన్య మహిళే. కాకపోతే కాస్త భిన్నం. బడి ముఖమే ఎరుగని సుబ్బలక్ష్మి గ్రంథాలయాల నుంచి తెప్పించుకొని కుదిరితే కొనుక్కొని వందల పుస్తకాలు చదివింది. వాటి నుంచి నోట్సు రాసుకుంది. తమిళం, ఆంగ్ల భాషల్లో కాల్పనిక సాహిత్యంతో పాటు ఖగోళశాస్త్రం, మానసిక శాస్త్రం, చరిత్ర, యాత్ర సాహిత్యం వంటి వైవిద్యం వున్న రంగాలకు సంబంధించిన పుస్తకాలను చదివింది. ప్రకృతంటే ప్రాణం ఆమెకు. చిత్రకళపై మక్కువ. దైవంపై విశ్వాసం ఉంది. కాని పూజలు, పునస్కారాలు చేయలేదు. మూఢ విశ్వాసాలూ లేవు. కూతురిని భర్త బడికి పంపనంటే మద్రాసుకు తీసుకొచ్చి అన్న ఇంట్లో ఉండి చదివించుకుంది. ఇలాంటి ఓ సాధారణ మహిళ కథ ఇది.
This Book Was Written By Various Authors