Price: Rs.50.00 /-
No.Pages: 88.
జాటోతు దర్గ్యా నాయక్ గెరిల్లా దళ నాయకుడు. తుపాకీ కాల్చడంలో దిట్ట. ధర్మాపురం పడమటి తండవాసి. జాటోతు హాము మంగిలి దంపతుల ఐదవ కుమారుడు దర్గ్యా. వీరి సోదరుడు జాటోతు ఠాను పేరుగాంచిన గెరిల్లా (గిరిజన) దళ నాయకుడు. ఠానును యూనియన్ సైన్యాలు దొరల గడిలో చిత్రహింసలు పెట్టి కాల్చి చంపాయి. వీరి సోదరుడయిన సోమ్లాను చితిమంటల్లో వేసి విస్నూరు దేశ్ముఖ్ కొడుకు బాబు దొర చంపాడు. పెద్దవాడైన జాటోతు జోద్యా ఆంధ్ర మహాసభను తీసుకువచ్చి పోరాట జెండాను సోదరులకు అందించాడు. ఇన్నాళ్ళకు జాటోతు కుటుంబం సాహస కృత్యాలు పాఠకులకు అందుతున్నందుకు సంబరపడుతున్నా. - కా. మల్లు స్వరాజ్యం