Price: Rs.150.00 /-
No.Pages: 231.
2017 సెప్టెంబర్ 5 న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గౌరి లంకేశ్ ను బెంగళూర్ లో ఆమె ఇంటి ముందే కాల్చి చంపారు. వారు భౌతికంగా నిర్మూలించినా తన రచనల ద్వారా ఇవాళ గౌరి లంకేశ్ కర్ణాటక సరిహద్దులను దాటి దేశ వ్యాప్తంగా మరెందరి మనసుల్లోనో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె రచనలు అనేక భాషల్లోకి అనువాదమై ఎందరెందరికో స్ఫూర్తినిస్తున్నాయి. గౌరి లంకేశ్ అమరురాలైన కొద్ది రోజుల్లోనే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 2017 నవంబర్ 28 న ఈ పుస్తకాన్ని తెలుగులోకి తెచ్చింది . నెల రోజుల వ్యవధి లోనే దాదాపు పుస్తక ప్రతులన్నీఅయిపోయి ద్వితీయ ముద్రణకు వెళ్తుండడం విశేషం. చదవండి ...చదివించండి ... గౌరి లంకేశ్ అమర్ రహే అని నినదించండి....!